ప్రజా ప్రభుత్వం - పేదల సంక్షేమం: 48వ డివిజన్లో CMRF చెక్కుల పంపిణీ
రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డిగారి నాయకత్వంలో, ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత, మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారి ఆదేశాల మేరకు నేడు 48వ డివిజన్లో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో శ్రీ అల్లే సాయికిరణ్గారు దగ్గరుండి పర్యవేక్షించగా, ఖమ్మం నగర మేయర్ శ్రీమతి పునుకొల్లు నీరజగారు, ఏ బ్లాక్ అధ్యక్షుడు శ్రీ బాలగంగాధర్ తిలక్గారి సమక్షంలో లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సేవా కార్యక్రమంలో శ్రీ బోజట్ల సత్యనారాయణగారు మరియు శ్రీ సింగం అంజయ్య గారు పాల్గొని లబ్ధిదారులకు భరోసా కల్పించారు.
ఆర్థిక సాయం పొందిన లబ్ధిదారులు:
✅ ఇనపల రాజశేఖర్: ₹50,000/-
✅ కేసగాని సౌజన్య: ₹20,000/-
✅ ప్రియాంక బొండాల: ₹20,000/-
✅ రావూరి రాజకుమార్: ₹18,500/-
*పాల్గొన్న నాయకులు:*మేచ్ని రామకృష్ణ, ఎస్కే జహీర్, వార శివ, దేవర వెంకన్న తదితర కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు