నేడు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన
మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకోనున్న సీఎం
కాళేశ్వరం ఆలయ అభివృద్ధి పనుల భూమిపూజ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం.
అనంతరం మేడిగడ్డకు చేరుకుని డ్యామ్ సైట్ ను పరిశీలించనున్న ముఖ్యమంత్రి
అక్కడే ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించి మీడియాతో మాట్లాడనున్న సీఎం
అక్కడి నుంచి నేరుగా కాటారం మండలం నస్తూరపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు చేరుకోనున్న ముఖ్యమంత్రి
బహిరంగ సభ వేదికగా “రైతు భరోసా” రెండో విడత నిధులను విడుదల చేయనున్న సీఎం.