శ్రీశైలంలో భారీగా మద్యం పట్టివేత
శ్రీశైలానికి బస్సులో మద్యం తెస్తున్న ఐదుగురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆత్మకూరుకి చెందిన వారి నుండి 314 క్వార్టర్ బాటిల్స్, 24 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు. శ్రీశైలంలో బెగ్గర్స్ను, హోటల్లో పనిచేసే సిబ్బందిని టార్గెట్ చేసుకొని మరుగుదొడ్లు, ఆర్టీసీ బస్టాండ్, సిద్ధి రామప్ప కాంప్లెక్స్ వద్ద మద్యం అమ్ముతున్నారు.