ఉద్యమ ఆధార్ రిజిస్ట్రేషన్ పైన శిక్షణ కార్యక్రమం
కామారెడ్డి ప్రతినిధి
తేదీ:16-04-2026
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రoలో ఈరోజు దోమకొండ మండల మహిళా సమైక్యలో సీసీ లకు మరియు వివోఏ లకు ఉద్యమ ఆధార్ రిజిస్ట్రేషన్ పైన శిక్షణ కార్యక్రమానికి నిర్వహించడం జరిగింది. డిఆర్డిఓ సీసీ లకు మరియు వివోఏలకు ఉద్యమ ఆధార్ రిజిస్ట్రేషన్ గురించి తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. మరియు మండల ట్రైనింగ్ సెంటర్ ని సందర్శించి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఏపీఎం శ్రీనివాస్, సమాఖ్య పాలకవర్గ సభ్యులు, సీసీలు వివో ఏలు పాల్గొనడం జరిగింది.