మజ్జి మదన్మోహన్ ను వైసిపి నాయకులు పరామర్శ
విజయనగరం జిల్లా. రాజాం.
రాజాం టౌన్ పరిధిలోని సారధి గ్రామానికి చెందిన ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు మజ్జి మదన్ మోహన్ తల్లి మజ్జి అమ్మడమ్మ అకాల మరణం పట్ల వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
ఈ విషయం తెలుసుకున్న రాజాం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇంచార్జి డా. తలే రాజేష్ వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సిరిపురపు జగన్మోహన్ రావు, టౌన్ పార్టీ అధ్యక్షులు పాలవలస శ్రీనివాసరావు పాల్గొన్నారు.
అదేవిధంగా టౌన్ పార్టీ ఉపాధ్యక్షులు దూబ గోపాలం, కిలారీ శ్రీనివాస రావు, జిల్లా కల్చరల్ విభాగం అధ్యక్షులు డా. బి నరేంద్ర, మజ్జి పెంటం నాయుడు, వారాడ వంశీ నాయుడు, టంకాల బుజ్జి, మిత్తిరెడ్డి నారాయణ రావు, లావేటి శ్రీహరి నాయుడు తదితర నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.