logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

రోలుగుంటలో అంబేద్కర్ జయంతి వేడుకలు

రోలుగుంట, ఏప్రిల్ 14: అంబేద్కర్ జయంతి సందర్భంగా రోలుగుంట శాఖ గ్రంథాలయంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ శిల్పి డా. బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులు పాల్గొని అంబేద్కర్ జీవిత విశేషాలను తెలుసుకున్నారు. రోలుగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు టీవీ శేషగిరిరావు గారు, ఆంగ్ల ఉపాధ్యాయురాలు నాగజ్యోతి గారు విద్యార్థులకు అంబేద్కర్ చేసిన సేవలను వివరించారు. ముఖ్యంగా భారత దేశానికి చేసిన అమూల్యమైన కృషి, రాజ్యాంగ నిర్మాణంలో ఆయన పాత్రను వివరించారు.
అదేవిధంగా డా. అంబేద్కర్ గారికి లభించిన “భారత రత్న” బిరుదు ప్రాముఖ్యతను కూడా విద్యార్థులకు తెలియజేశారు. సమానత్వం, న్యాయం, స్వాతంత్ర్యం వంటి విలువలను ఆయన జీవితం ద్వారా ఎలా సాధించారో వివరించారు.
ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో అంబేద్కర్ ఆలోచనలు, విలువలపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

1
0 views

Comment