సీఐ ఇంద్రసేనారెడ్డికి ట్రాఫిక్ ఎస్ఐ గడ్డం ప్రవీణ్ కి అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ ఆహ్వానం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్లో నిర్వహించే ఏప్రిల్ 14 మంగళవారం ఉదయం 10 గంటలకు అంబేద్కర్ విగ్రహమునకు పూలమాల అలంకరణ కార్యక్రమానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ వసంతాల జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్ ఆన్తోటి పాల్ ప్రత్యేక గౌరవాధ్యక్షులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ కుసపాటి శ్రీనివాస్ సబ్బరపు మధుసూదన్ రావు కోలాపూరి ధర్మారాజు పీక కృష్ణ సలిగంటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 14 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాల సందర్భంగా కొత్తగూడెం మూడవ పట్టణ సిఐ ఇంద్రసేనారెడ్డి ట్రాఫిక్ ఎస్సై గడ్డం ప్రవీణ్ కు ఆహ్వాన అందజేసిన అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్ జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి శ్రీలత పాల్గొంటారు. కావున కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే భారతరత్న నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 135వ వసంతాల జయంతి ఉత్సవాలకు అందరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం