ఎల్లారెడ్డిపేటఎస్బిఐ ఏటీఎంలోచోరీ 6 లక్షలు మాయం
ఎల్లారెడ్డిపేటలో ఏటీఎం చోరీ
అక్కపల్లి ఫారెస్ట్ లో ఏటీఎం మిషన్ లభ్యం
ప్రజా వాయిస్ ఎల్లారెడ్డిపేట/ సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్కు ఎదురుగా ఉన్న ఏటీఎం మిషన్ అర్ధరాత్రి ఒంటిగంటకు ఏటీఎం తో ఆరు లక్షలు సహా మిషన్ ని ఎత్తుకెళ్లిన దుండగులు అక్కపల్లి గ్రామ పొలిమేర లో ని పందిగుట్ట వద్ద ఏటీఎం మిషిన్ ని పగలగొట్టి డబ్బు పెట్టెను ఎత్తుకెళ్లిన దొంగలు ఖాళీ మిషిన్ ని ధ్వంసం చేసి అక్కడే పారవేశారు సంఘటనా స్థలానికి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బిగితే మరియు సిరిసిల్ల డిఎస్పి నాగేంద్ర చారి ఎల్లారెడ్డిపేట సిఐ వెంకటేష్ చందుర్తి సిఐ వెంకటేశ్వర్లు ఎస్ఐలు రాహుల్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి మోతిరామ్ ఫింగర్ ప్రింట్ సిబ్బంది పాల్గొని దర్యాప్తును కొనసాగిస్తున్నారు త్వరలోనే దుండగులను పట్టుకుంటామని ఎస్సై కే రాహుల్ రెడ్డి అన్నారు.