75% అటెండెన్స్ లేకపోతే ఫీజు రీయింబర్స్మెంట్ కట్
తెలంగాణ : ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫేషియల్ అటెండెన్స్ను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులకు కనీసం 75% హాజరు లేకపోతే పరీక్షలకు అనుమతి ఇవ్వకపోవడంతో పాటు స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ను రద్దు చేయాలని నిర్ణయించింది. అలాగే ఇంటర్ ఫలితాలు వెలువడిన వెంటనే ‘దోస్త్’ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. కాలేజీలో చేరిన రోజే విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ అందిస్తామని అధికారులు తెలిపారు.