*దారుణం.. ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వమని అడిగినందుకు టీచర్ హత్య*
జర్నలిస్టు : మాకోటి మహేష్
కర్ణాటక రాష్ట్రం, కలబురిగి జిల్లా, కమలాపూర్ తాలూకాలోని కల్ముడా గ్రామంలో ఘటన
బీదర్ జిల్లా, భాల్కి తాలూకా, వందేర్ ఖేడా అనే గ్రామంలో టీచర్ గా పని చేస్తున్న జ్యోతి కపాలే(57) అనే మహిళ
తనకు బాగా తెలిసిన వ్యక్తి అప్పు అడగడంతో.. వెంటనే అతనికి రూ. 14 లక్షలు ఇచ్చిన మహిళ
అయితే.. రోజులు, నెలలు గడుస్తున్నా అప్పు తిరిగి ఇవ్వకపోవడంతో గట్టిగా నిలదీసిన జ్యోతి
దీంతో ఆమెతో గొడవ పెట్టుకున్న నిందితుడు.. ఆమెపై పగ పెంచుకుని చంపాలని ప్రణాళిక
కలబురిగిలోని తన ఫ్యామిలీని కలిసేందుకు వెళ్తుండగా.. జ్యోతిపై ఎటాక్ చేసి, హత్య చేసిన నిందితుడు
ఆపై ఆమె ఆనవాళ్లు లేకుండా చేసేందుకు.. మృతదేహన్ని కాల్చి బూడిద చేసిన దుండగుడు
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు షురూ.. నిందితుడు ఆనంద్ అరెస్ట్.