హెల్త్ రన్ లో పాల్గొన్న మేయర్ గణేష్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల ఆధ్వర్యంలో ఏప్రిల్ ఏడో తారీఖు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకొని హెల్త్ రన్ నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ పాల్గొన్నారు.. జి జి హెచ్ కొత్తగూడెం నుండి ప్రకాశం స్టేడియం వరకు హెల్త్ రన్ యశోద హాస్పిటల్ సహకారంతో నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా డిప్యూటీ మేయర్ కార్పొరేటర్లు ప్రజాప్రతినిధులు డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు