రేపు కర్రెగుట్టలలో డీజీపీ శివధర్ రెడ్డి పర్యటన
జర్నలిస్ట్: ఆకుల గణేష్
ములుగు జిల్లా కర్రెగుట్టలలో రేపు డీజీపీ శివధర్ రెడ్డి పర్యటించనున్నారు. ముర్మూరు బేస్ క్యాంప్ నుండి తడపల వరకు చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులను ఆయన పరిశీలించనున్నారు. అనంతరం గుత్తికోయలతో ఎరపటు చేసిన కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో డీజీపీ పాల్గొననున్నారు. డీజీపీ పర్యటన నేపథ్యంలో కేంద్ర బలగాలు, పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.