గ్రామసభలో ప్రజాపాలన పథకాలపై ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ వివరణ
జర్నలిస్ట్: ఆకుల గణేష్
ప్రజాపాలన ప్రభుత్వం నిర్వహిస్తున్న 99 రోజుల ప్రణాళికలో భాగంగా గురువారం భూపాలపల్లి నియోజకవర్గంలోని చెల్పూర్ లో గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ట్రెడ్ ప్రమోషన్ చైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామీణ, పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని, ఇందిరమ్మ ఇండ్లు, వడ్డీ లేని రుణాలు, ఇందిర మహిళాశక్తి, మహాలక్ష్మి, రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి, గృహజ్యోతి, పింఛన్లు వంటి పథకాలను ప్రజలకు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజల జీవితాల్లో మార్పు కోసమే సీఎం రేవంత్ రెడ్డి సైనికుడిలా పనిచేస్తున్నారని పేర్కొన్నారు.