logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అవగాహన

జర్నలిస్ట్: ఆకుల గణేష్

భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం మద్దులపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామసభ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఎల్పుల సరిత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి పథకం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ₹500 గ్యాస్ సిలిండర్, సన్న రకం వడ్ల కొనుగోలుకు బోనస్, చేయూత పెన్షన్లు, గృహజ్యోతి పథకం వంటి పలు సంక్షేమ పథకాలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.

1
77 views

Comment