కోవూరు మండలం పడుగుపాడు పంచాయతీలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం
కోవూరు మండలం పడుగుపాడు పంచాయతీ పాలక వర్గం పదవీకాలం ఏప్రిల్ 2న ముగియనున్న సందర్భంగా ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, ప్రజాప్రతినిధులు సర్పంచ్ అహ్మద్ గారిని, వార్డు సభ్యులను మరియు గతంలో పంచాయతీ ఈవోలుగా పనిచేసిన అధికారులను ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా వారు గ్రామ అభివృద్ధికి చేసిన సేవలను కొనియాడుతూ, ప్రజలకు అందించిన సేవలను ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా DLDA మాజీ డైరెక్టర్ కాటం రెడ్డి దినేష్ రెడ్డి గారు, జల జీవన్ మిషన్ చైర్మన్ గోపిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, జడ్పిటిసి సభ్యురాలు కవరగిరి శ్రీలత గారు, ఎంపీటీసీ సభ్యులు షేక్ పర్వీన్ గారు, సున్నపు బాబురావు గారు, కల్లూరు లక్ష్మయ్య గారు పాల్గొన్నారు.