విజయవాడలో తెల్లవారు జామున ప్రైవేట్ బస్సులో మంటలు
బస్సు తగలబడుతుంటే చెప్పులు మర్చిపోయానని మళ్లీ లోపలకు వెళ్ళిన మహా తల్లి..విజయవాడలో తెల్లవారు జామున ప్రైవేట్ బస్సులో మంటలు భయం కలిగించాయి. రావులపాలెం నుంచి హైదరాబద్ వెళ్తున్న సాయిఆర్కే ట్రావెల్స్ బస్సు, బస్టాండ్ దగ్గరకు వచ్చాక చెలరేగిన మంటలతో కలకలం చెలరేగింది. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. వెంటనే అప్రమత్తమై మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది, బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినట్టు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటనలో విచిత్రం ఏమిటంటే, బస్సు తగలబడుతుంటే, ఓ మహిళ బస్సులో చెప్పులు మర్చిపోయానని మళ్లీ బస్సులోకి పోయి చెప్పులు తెచ్చుకోవడం.. కొసమెరుపు..