డుంబ్రిగుడ: దుంప జాతి పంటల ప్రాముఖ్యత పరిరక్షణపై అవగాహన
దుంప జాతి పంటల ప్రాముఖ్యత, వినియోగం పై భారత వ్యవసాయ పరిశోధన మండలి శాస్త్రవేత్త డా మురుగేశన్ గిరిజన రైతులకు వివరించారు. శనివారం డుంబ్రిగుడ మండలం గసభ గొందివలస గ్రామంలో దుంప జాతి రకాలు వాటి పరిరక్షణ పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేరళం రాష్ట్రం నుండి తెచ్చిన కొన్ని కొత్త రకాల దుంప లను రైతులకు అందించారు. దుంప జాతులను పండించి, వాటిని రక్షించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వాసన్ సంస్థ ప్రతినిధులు నరసింగరావు, ప్రసాదరావు, వెంకట్ లు పాల్గొన్నారు.