వైసిపి నాయకుడు పుల్లయ్య కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి.
నంద్యాల (AIMA MEDIA ): నంద్యాల మండలంలోని పుసులూరు గ్రామం వైఎస్ఆర్సిపి నాయకుడు పుల్లయ్య అనారోగ్యంతో మరణించారు.శుక్రవారం మాజీ శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పుసులూరు గ్రామంలో వారి నివాసానికి వెళ్లి పుల్లయ్య కుటుంబ సభ్యుల ను పరామర్శించారు.గ్రామంలో పార్టీ కోసం ఎంతో కృషి చేశారని వారి కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు శిల్పా కుటుంబం అండగా ఉంటుందని పుల్లయ్య కుటుంబానికి భరోసానిచ్చారు.ఈ కార్యక్రమంలో నంద్యాల అసెంబ్లీ RTI వింగ్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, ఎంపిటిసి ముక్కర సుదర్శన్ రెడ్డి, సర్పంచ్ రామసుబ్బయ్య, సుధాకర్ రెడ్డి, మరియు గ్రామ వైసీపీ నాయకులు పాల్గొన్నారు.