మార్కాపురం బస్సు ప్రమాదంపై డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి.
మార్కాపురం జిల్లా రాయవరం వద్ద చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో 13 మంది సజీవ దహనం అయ్యారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. ప్రమాదానికిగల కారణాల గురించి జిల్లా అధికార యంత్రాంగం నుంచి వివరాలు తీసుకున్నాను. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని స్పష్టం చేయడమైనది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.