పశ్చిమాసియాలో తలెత్తిన సంక్షోభం నేపథ్యంలో రాష్ట్రంలో పెట్రోల్, గ్యాస్ సిలిండర్లు (ఎల్ పీజీ), యూరియా నిల్వలపై ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు
అత్యవసర ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు శాసనసభ కమిటీ హాలులో మంత్రులు, ఉన్నతాధికారులతో పరిస్థితిని సమీక్షించనున్నారు.
రాష్ట్రంలో ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా, అలాగే పెట్రోల్, గ్యాస్ కొరత తలెత్తకుండా నిల్వల నిర్వహణ, ముందస్తు జాగ్రత్తలపై సమావేశంలో సమీక్షించనున్నారు