సుప్రీంకోర్టు తీర్పును అధికారులు పట్టించుకోవడం లేదు. నర్సీపట్నం సీనియర్ భాజపా నేత
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు కాళ్ల సుబ్బారావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ముఖ్య తీర్పును అధికారులు పూర్తిగా పట్టించుకోవడం లేదని తీవ్రంగా విమర్శించారు. మార్చి 24, 2026న వెలుగులోకి వచ్చిన ఈ తీర్పులో క్రైస్తవ మతంలోకి మారిన షెడ్యూల్డ్ కులాల వ్యక్తులు రిజర్వేషన్ సౌలభ్యాలు, SC/ST అట్రాసిటీ చట్ట రక్షణను కోల్పోతారని స్పష్టం చేశారు.నర్సీపట్నం చుట్టుపక్కల ప్రాంతాల్లో మతమార్పిడి విచ్చలవిడిగా సాగుతోంది. అన్య మతస్తులుగా మారిన చాలామంది ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు. అధికారులకు ఇది తెలిసినా చర్యలు తీసుకోవడం లేదని, నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని సుబ్బారావు ఆరోపించారు. రాజ్యాంగ షెడ్యూల్డ్ కులాల ఆర్డర్ 1950 ప్రకారం హిందూ, సిక్కు, బౌద్ధ మతస్థులకు మాత్రమే SC హోదా వర్తిస్తుంది.వెంటనే పరిశీలన చేసి మతం మారిన వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలని సుబ్బారావు డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోకపోతే భారీ ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.