గొర్రెకుంట లో 600 లీటర్ల గుడుంబా పానకం ధ్వంసం
జర్నలిస్ట్: ఆకుల గణేష్
వరంగల్ గొర్రెకుంట శివారులో పోలీసులు గుడుంబా స్థావరంపై దాడి చేసి, 600 లీటర్ల పానకాన్ని ధ్వంసం చేశారు. అక్రమ మద్యం నిల్వలను స్వాధీనం చేసుకుని, నిందితుడిపై గీసుగొండ పోలీసులు కేసు నమోదు చేశారు. వంచనగిరిలో నిషేధిత గుట్కా, రూ. 12,190 విలువైన పొగాకు ఉత్పత్తులను కూడా సీజ్ చేశారు. అక్రమ దందాలపై గీసుగొండ పోలీసులు ఉక్కుపాదం మోపుతూ, గుడుంబా, గుట్కా విక్రేతలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.