మన్యం జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడిగా బిసాపు బాలకృష్ణ ను నియమించిన అఖిల భారత యాదవ మహాసభ
విజయవాడ: మన్యం జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడిగా బీసాపు బాలకృష్ణను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యాదవ సంఘం అధ్యక్షులు చింకా నారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 15 ఆదివారం విజయవాడలో జరిగిన అఖిల భారత యాదవ మహాసభ లో మన్యం పార్వతిపురం జిల్లా సాలూరు టౌన్ కి చెందిన బి. బాలకృష్ణ ను నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉన్న యాదవుల సంక్షేమానికి అంతఃకరణ శుద్ధితో అలుపెరుగని కృషి చేస్తానని, ప్రభుత్వం నుండి రావాల్సిన రాయితీలు వచ్చే విధంగా కృషి చేస్తానని అన్నారు.