అరకు: ఐవిఆర్ఎస్ కాల్స్ పై అవగాహణ కల్పించిన తాహశీల్దార్
ఐవిఆర్ఎస్ ఫోన్ కాల్స్ కు లబ్ధిదారులు స్పందించాలని అరకులోయ తాహశీల్దార్ కుమారస్వామి తెలిపారు. సోమవారం మండలంలోని పెదలబుడు గ్రామంలో ఐవిఆర్ఎస్ కాల్స్ పై నిర్వహించిన అవగాహణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పౌరసరఫరాలు, రెవెన్యూ సేవల గురించి వివరించి, ఈ సేవలపై వచ్చే కాల్స్ కి ప్రజలు ఖచ్చితమైన స్పందన ఇవ్వాలని సూచించారు. స్థానిక సర్పంచ్ దాసుబాబు, టీడీపీ మండల అధ్యక్షుడు మహాదేవ్ పాల్గొన్నారు.