భద్రకాళి అమ్మవారికి లక్ష గులాబీ పూలతో అర్చన
జర్నలిస్ట్: ఆకుల గణేష్
వరంగల్ నగరంలో శ్రీ భద్రకాళి అమ్మవారి వసంత నవరాత్రి మహోత్సవాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారికి లక్ష గులాబీ పూలతో అర్చన చేశారు. తొమ్మిది రోజులపాటు జరిగే ఈ మహోత్సవంలో అమ్మవారికి రోజూ ఒక రంగు పూలతో అర్చన నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు.