ములుగు: ఆ గ్రామంలో మద్యం అమ్మితే పథకాలు కట్
జర్నలిస్ట్: ఆకుల గణేష్
ములుగు జిల్లా తాడ్వాయి మండలం గోనెపల్లిలో ఆదివారం గ్రామస్థులు సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తూ తీర్మానం చేశారు. గ్రామసభలో తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం, గ్రామంలో మద్యం, గుడుంబా వంటి మత్తు పానీయాలు విక్రయించే కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు, రేషన్ బియ్యం, సంక్షేమ పథకాలు నిలిపివేయబడతాయి. ఈ నిబంధనలను అతిక్రమిస్తే, వారి శుభకార్యాలకు, దిన కార్యాలకు గ్రామస్థులు సహకరించబోమని స్పష్టం చేశారు.