గరికపాటి ని అరెస్ట్ చేయాలి.. సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్లు..?
ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. తన వాక్చాతుర్యంతో ధర్మం గురించి, సమాజం గురించి అద్భుతంగా వివరించే ఆయన, తాజాగా మధ్యాహ్న భోజనం పథకంపై చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి.
పేద విద్యార్థులకు పెట్టే ఆహారం, ఇచ్చే పుస్తకాలపై ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. అసలు గరికపాటి ఏమన్నారు? ప్రజలు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు? ఈ వివాదం వెనుక ఉన్న అసలు సంగతేంటో ఇప్పుడు చూద్దాం.
Garikapati Narasimha Rao : బిగ్ బ్రేకింగ్.. గరికపాటి ని అరెస్ట్ చేయాలి.. సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్లు..
గరికపాటి గారు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, ఉచిత యూనిఫాంలు, పుస్తకాలు అందించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. చదువుకోవాలనే కసి ఉన్న విద్యార్థి ఇంటి నుంచే అన్నం తెచ్చుకోవాలని, లేదంటే మానేయాలని ఆయన అనడం అందరినీ విస్మయానికి గురిచేసింది. ముఖ్యంగా భోజనంలో గుడ్లు పెట్టడం వంటి నిర్ణయాలను అర్థరహితం అని కొట్టిపారేయడం, ప్రభుత్వం కేవలం విద్యాబోధనకే పరిమితం కావాలని సూచించడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ఇవన్నీ ఉచితంగా ఇస్తుంటే విద్యార్థులు శోభనం గదిలో పెళ్లికొడుకుల్లా తయారవుతారని ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలు విమర్శల వెల్లువకు కారణమయ్యాయి.
ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. పేద విద్యార్థుల ఆకలిని, వారి అవసరాలను హేళన చేసేలా గరికపాటి మాట్లాడటం సరికాదని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, వెంటనే ఆయన్ని అరెస్ట్ చేయాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా దళిత, బహుజన సంఘాలు గరికపాటి తీరును తప్పుబడుతూ ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి. పేదరికం అంటే ఏంటో తెలియని వారు ఇలాంటి అహంకారపూరిత మాటలు మాట్లాడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గరికపాటి చేసిన వ్యాఖ్యలు సమాజంలోని ఒక వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి ఆయనను అరెస్ట్ చేయాలనే హ్యాష్ ట్యాగ్లు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో గరికపాటి అరెస్ట్ అవుతారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. చట్టపరంగా ఆయనపై కేసులు నమోదైతే పోలీసుల చర్యలు ఎలా ఉంటాయో చూడాలి. ఏది ఏమైనా ఒక విద్యావంతుడు, పండితుడు అయి ఉండి పేద పిల్లల తిండి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం అని గుర్తించకపోవడం శోచనీయం. ఈ వివాదం ఇంకా ఎంత దూరం వెళ్తుందో వేచి చూడాలి.