భూమి మనుగడకు అడవులు చాలా అవసరం: అరకు ఎఫ్ఆర్ఓ
భూమి మనుగడకు అడవులు అవసరమని అరకు ఎఫ్ఆర్ఓ కోటేశ్వరరావు అన్నారు. శనివారం ప్రపంచ అటవీ దినోత్సవం, స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాలలో బాగంగా అరకులోయ అటవి శాఖ కార్యాలయ ఆవరణలో సిబ్బందితో మొక్కలు నాటారు. అడవుల ప్రాముఖ్యత, పరిరక్షణ, జీవవైవిద్యంపై అవగాహన కల్పించడమే ప్రపంచ అటవీ దినోత్సవ ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు. అరకు ఫారెస్ట్ రేంజ్ పరిదిలో 27 వేల హెక్టార్లలో అటవులు ఉన్నాయని ఎఫ్ఆర్ఓ వెల్లడించారు.