శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం అర్చకులకు ఉగాది పురస్కారము.
పాణ్యం (AIMA MEDIA ): దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశముల మేరకు గురువారం ఆలయ ప్రధాన అర్చకుల పురస్కారం నిర్వహించారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం నందు నూతన సంవత్సరం సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు పుల్లయ్య స్వామి, వీరయ్య స్వామి వారికి ఆలయ ఈవో యం.రామక్రిష్ణ, ఉగాది ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మిలిటరీ సుబ్బారెడ్డి, సిబ్బంది శాలువాలు, పూలమాలలు, శేష వస్త్రములు, 10,116/- పారితోషికం సమర్పించి ఘనంగా సత్కరించారు. అదేవిధంగా వేద పండితుడు రోహిత్ శర్మ వారిని కూడా సత్కరించారు.