ఉపాధి హామీ లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ రాజర్షి షా
పత్రిక ప్రకటన
మార్చి 20, 2026_ఆదిలాబాదు:
ఉపాధి హామీ పథకం కింద నిర్దేశించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్ఆర్ఈజీఎస్ మెటీరియల్ వ్యయం, వివిధ పెండింగ్ పనుల పురోగతిపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి మండలం, విభాగం వారీగా మెటీరియల్ కాంపోనెంట్ నిధులను వినియోగించుకుంటూ పనుల్లో నాణ్యత పాటించాలని సూచించారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, నిధుల వ్యయంలో పారదర్శకత ప్రదర్శించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పనుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ఈ సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్ రాథోడ్, పంచాయతీ రాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శివరామ్, ఏఈఈలు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.