తల్లితండ్రులు లేని చిన్నారికి ఆర్థిక సహాయం చేసి మరో సారి మానవత్వం చాటుకున్న ఆయుర్వేద వైద్యురాలు
కామారెడ్డి ప్రతినిధి
పాముల సంతోష్ కుమార్
తేదీ:20-032026
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామంలో అకాలమరణంతో తల్లిదండ్రులని కోల్పోయిన చిన్నారి ప్రస్తుతం అమ్మమ్మ, తాతయ్య ల దగ్గర ఉంటున్న పరిస్థితి తెలుసుకున్న సదాశివ నగర్ మండల ఆయుర్వేద వైద్యురాలు 'నహిదా, చిన్నారికి ఆర్థిక సహాయం అందించారు.ఈ రంజాన్ మాసంలో తనకి తోచినంత ఆర్థిక సహాయం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను అని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం మరియు ఆశవర్కర్ పాల్గొనడం జరిగింది