logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

మాల భవన నిర్మాణానికి స్థల సేకరణ వేగవంతం – నేతల సుడిగాలి పర్యటన

మాల భవన నిర్మాణం కోసం స్థల సేకరణ కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికి నేతలు ఈరోజు సుడిగాలి పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా వచ్చేనెల 9వ తేదీన స్థల రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని నిర్ణయించారు.
ఈ నిర్మాణానికి అవసరమైన రూ.35 లక్షలను మాల జాతి సభ్యుల నుంచి సేకరించాలని నిర్ణయించి, అందుకు సంబంధించి సమాజంలోని పెద్దలను కలుసుకుని చర్చలు జరిపారు.
ఈ పర్యటనలో భాగంగా ముత్యాలపాలెం ప్రాంతానికి చెందిన పెద్దలు జల్లి కుమార్ అన్న గారిని, అలాగే కోవూరు ప్రాంతానికి చెందిన చిన్నయ్య సార్, ఎజ్రా సార్, రమణయ్య గారు, శ్రీను సార్ తదితరులను కలుసుకున్నారు.
ఈ సందర్భంగా మాలల ఐక్యత అవసరాన్ని వివరించిన నేతలు, సమాజంపై జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కోవడానికి ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. అలాగే డా. B. R. Ambedkar ఆశయాలను కొనసాగించాలంటే, ఆయన ఆలోచనలను ఆచరణలో పెట్టాలంటే ఒక సామూహిక భవనం అవసరమని వివరించారు.
ఈ ప్రతిపాదనపై పలువురు పెద్దలు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
చివరగా “జై భీమ్, జై మాల” నినాదాలతో కార్యక్రమం ముగిసింది.

5
209 views

Comment