అకాలవర్షంతోరాలినవడ్లు రైతులఆవేదన
వడగళ్లవానతో రాలినవడ్లు
నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
ప్రజా వాయిస్ ఎల్లారెడ్డిపేట/ సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి గ్రామంలో ఈరోజు కురిసిన వడగళ్ల వానకు రాళ్లుపడడంతో వరి పొలంలో వడ్లు నేలరాలినాయి దీనిపై ప్రభుత్వం అధికారులను కమిటీ వేసి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని అక్కపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు జంగ భూంరెడ్డి అన్నారు గత ప్రభుత్వం కూడా ఎన్నోసార్లు పంటలు నష్టపోయిన రైతులను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే అధికారులు వచ్చి సర్వే చేసుకొని రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.