చోడవరం ఎమ్మెల్యే చేతులతో 'పబ్లిక్ సత్తా' పత్రిక ఘన ఆవిష్కరణ
అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం స్థానిక శాసనసభ్యులు కే.ఎస్.ఎన్.ఎస్. రాజు చేతుల మీదుగా 'పబ్లిక్ సత్తా' దినపత్రిక ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ప్రజల సమస్యలకు స్పందించే ఈ కొత్త పత్రిక జిల్లా పత్రికా రంగానికి మరో మైలురాయి అవుతుందని ఆకాంక్ష వ్యక్తం చేశారు.పత్రిక ఎడిటర్ కొప్పు శ్రీను మాట్లాడుతూ, "ప్రజల సత్య సమాచారాన్ని వారి ముందుంచి, స్థానిక సమస్యలపై గళం విప్పి వారి సమస్యలను తీర్చాలనే లక్ష్యంతో ఈ పత్రికను ప్రారంభిస్తున్నాము. పాఠకుల మద్దతుతో మంచి పేరు సంపాదించుకొని ముందుండాలని ఆశిస్తున్నాను" అని పేర్కొన్నారు.అనంతరం ఎమ్మెల్యే కే.ఎస్.ఎన్.ఎస్. రాజు మాట్లాడుతూ, "ప్రజల సమస్యలను ప్రభుత్వం ముందుంచి, ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసే ఈ పత్రికకు మా అభినందనలు. తెలుగుదేశం పార్టీ తెలుగు పత్రికా రంగాన్ని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుంది" అని తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యకర్తలు, నాలుగు మండలాల పత్రికా విలేకరులు పాల్గొన్నారు.