యువతే లక్ష్యం… జనసేన ఉద్యమి నమోదు ప్రారంభం
సూళ్లూరుపేట: నియోజకవర్గంలోని మన్నారు పోలూరు గ్రామంలో టిడ్కో హౌసెస్ సమీపంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో “జనసేన ఉద్యమి నమోదు” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన జాతీయ మీడియా ప్రతినిధి, ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
గ్రామంలో ప్రతి ఒక్కరిని “జనసేన ఉద్యమి” సభ్యులుగా నమోదు చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పార్టీ నాయకులు తెలిపారు.
ఈ సందర్భంగా వేములపాటి అజయ్ మాట్లాడుతూ, జనసేన పార్టీ తరఫున సభ్యత్వం పొందిన ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. కార్యకర్తలను నాయకత్వ స్థాయికి తీసుకువచ్చే రాజకీయ సంస్కృతి జనసేనలోనే ఉందని పేర్కొన్నారు.
అలాగే పార్టీ అధ్యక్షుడు Pawan Kalyan యువతను రాజకీయాల్లోకి తీసుకురావాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారని తెలిపారు.
ఇంకా మాట్లాడుతూ, పేదలకు ఇళ్ల కలను నెరవేర్చేందుకు ప్రారంభించిన టిడ్కో హౌసింగ్ ప్రాజెక్టులను గత ప్రభుత్వం నిలిపివేసిందని విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పేదలకు సొంత ఇళ్ల కలను సాకారం చేయడానికి కట్టుబడి ఉందని, ఉగాది నాటికి లక్షలాది మందికి ఇళ్ల పంపిణీ దిశగా చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు.
డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న Pawan Kalyan గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ గ్రామాల్లో రహదారులు, పంచాయతీలకు నిధులు అందిస్తూ గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు వేస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని జనసేన నాయకులు సుంకు సురేష్, మహబూబ్ బాషా, ఆవుల నాగేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల, జిల్లా నాయకులు నూనె మల్లికార్జున యాదవ్, కారంపూడి కృష్ణారెడ్డి, జమీర్ తదితరులు పాల్గొన్నారు.
జనసేన ఉద్యమి నమోదు కార్యక్రమాన్ని ప్రతి గ్రామానికి విస్తరించాలని నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.