నితీష్ ఆత్మహత్య ఘటనపై విచారణకు డిమాండ్ – బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
తెలంగాణ స్టేట్ **భద్రాద్రి కొత్తగూడెం జిల్లా** కొత్తగూడెం టౌన్** మార్చి 17:(ఏఐఎంఏ మీడియా ప్రతినిధి
నితీష్ ఆత్మహత్య ఘటనపై విచారణకు డిమాండ్ – బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
కొత్తగూడెం, మార్చి 17:(ఏఐఎంఏ మీడియా ప్రతినిధి) తెలంగాణ పత్రిక
కొత్తగూడెంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నితీష్ ఆత్మహత్య ఘటనపై అతని తల్లి మౌనిక మౌన నిరసన చేపట్టి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లక్ష్మీదేవిపల్లి మండలానికి చెందిన నితీష్, 10వ తరగతి చదువుతూ శ్రీ చైతన్య విద్యాసంస్థలో విద్యనభ్యసిస్తున్న సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు బయటపెట్టాలని ఆమె కోరారు.
మౌనిక ఆరోపణల ప్రకారం, స్కూల్ క్లాస్ టీచర్, ప్రిన్సిపాల్ మరియు సంబంధిత సిబ్బంది తన కుమారుడిని మానసికంగా వేధింపులకు గురిచేసినట్లు తెలిపారు. ఈ అంశంపై పూర్తిస్థాయి దర్యాప్తు నిర్వహించి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అలాగే తన కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సంబంధిత విద్యాసంస్థ నిర్వహణపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు కురిమెళ్ళ శంకర్ మాట్లాడుతూ, నితీష్పై స్కూల్లో అనుచిత ప్రవర్తన జరిగిందని వచ్చిన ఆరోపణలను సీరియస్గా పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థిని తోటి విద్యార్థులతో కలిసిపోకుండా ఆంక్షలు విధించడం, మానసిక ఒత్తిడికి గురిచేసే పరిస్థితులు ఉన్నాయన్న ఆరోపణలపై నిష్పక్షపాత విచారణ జరపాలని కోరారు. ఒక బ్రాంచ్ నుండి మరొక బ్రాంచ్కు మార్పు వంటి పరిణామాలు విద్యార్థిపై ప్రభావం చూపినట్లయితే, వాటిని కూడా దర్యాప్తులో భాగంగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు.విద్యాసంస్థల్లో విద్యార్థులపై మానసిక ఒత్తిడి, టార్గెట్ విధానాలపై వస్తున్న ఆరోపణలను అధికారులు గమనించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. నితీష్ మరణానికి సంబంధించి బాధ్యత వహించిన వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేసి, న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొని బాధిత కుటుంబానికి మద్దతు తెలిపారు.