నూజివీడు లోని వేణు మ్యాథమేటిక్స్ అకాడమీ ఆధ్వర్యంలో,
ముత్యాల పండు రంగారావు (వేణు) పద్మావతి గారి జ్ఞాపకార్థం
మ్యాథమేటిక్స్ టాలెంట్ టెస్ట్
నూజివీడు లోని వేణు మ్యాథమేటిక్స్ అకాడమీ ఆధ్వర్యంలో,
ముత్యాల పండు రంగారావు (వేణు) – పద్మావతి గారి జ్ఞాపకార్థం
మ్యాథమేటిక్స్ టాలెంట్ టెస్ట్ – 2026 విజయవంతంగా నిర్వహించబడింది.
ఈ పరీక్షను నూజివీడు లోని శ్రీ సత్య సాయి బాల భారతీ యు.పి పాఠశాలలో,
అకాడమీ డైరెక్టర్ మరియు సీనియర్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ అయిన
ముత్యాల వేణు గోపాల్ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు
కృష్ణమూర్తి గారు, అలాగే పాఠశాల సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు
సర్టిఫికేట్లు, పుస్తకాలు మరియు పెన్నులు బహుమతులుగా అందజేశారు.
విద్యార్థుల్లో గణితంపై ఆసక్తి పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు.