logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు - అడిషనల్ ఎస్పీ శ్రీ ఎస్.ఆర్. రాజశేఖర్ రాజు



చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు - అడిషనల్ ఎస్పీ శ్రీ ఎస్.ఆర్. రాజశేఖర్ రాజు



జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులు ప్రశాంతంగా మరియు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షిస్తూ విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ తెలిపారు.



చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సోమవారం నుండి ప్రారంభమయ్యే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ తరపున కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు అడిషనల్ ఎస్పీ శ్రీ ఎస్.ఆర్. రాజశేఖర్ రాజు ఆదివారం తెలిపారు.



జిల్లా వ్యాప్తంగా మొత్తం 114 పరీక్షా కేంద్రాలలో ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ అన్ని అవసరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.



పరీక్షా పత్రాలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పోలీసు సిబ్బందితో పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. అలాగే పరీక్షా పత్రాలను కేంద్రాలకు తరలించే సమయంలో మరియు సమాధాన పత్రాలను తిరిగి తీసుకెళ్లే సమయంలో పోలీసు బందోబస్తు కల్పించనున్నట్లు తెలిపారు.



పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమలులో ఉంటుందని, కేంద్రాల పరిసర ప్రాంతాల్లో అనవసరంగా వ్యక్తులు గుమిగూడకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను తాత్కాలికంగా మూసివేయాలని సూచనలు ఇచ్చినట్లు తెలిపారు.



జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పరీక్షా కేంద్రాలలో సంబంధిత పోలీసు అధికారుల ఆధ్వర్యంలో అవసరమైన మేరకు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పరీక్షల సమయంలో ఎలాంటి అవకతవకలు, మాస్ కాపీయింగ్ లేదా మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.



పరీక్షా కేంద్రాల వద్ద ట్రాఫిక్ అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని, విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు.



పరీక్షా కేంద్రాలలో విద్యార్థులతో పాటు పరీక్ష విధులు నిర్వహించే సిబ్బంది తప్ప ఇతరులు ఎవరూ ఉండరాదని, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.



ఎవరైనా మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడినా లేదా వారికి సహకరించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అడిషనల్ ఎస్పీ గారు హెచ్చరించారు.



విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయేందుకు పోలీసు శాఖ సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు.

4
8 views

Comment