అరకు రేపటి నుండి రైతన్న మీకోసం కార్యక్రమం
రైతన్న మీకోసం కార్యక్రమం ఈ నెల 16 నుండి 22 వరకు జరుగుతుందని ఆదివారం అరకు వ్యవసాయ శాఖ ఏడీఏ వి మోహనరావు చెప్పారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది గ్రామస్థాయిలో పర్యటించి తొలకరికంటే ముందే వచ్చే వర్షపు నీటి నిర్వహణ, ఫ్రీ ఖరీఫ్ కాలంలో రైతులు చేయవలసిన పనులపై అవగాహణ కల్పిస్తారని ఏడిఏ తెలిపారు. మరీ ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయ పద్దతుల గురించి వివరిస్తారని పేర్కొన్నారు.