వందరోజుల యాక్షన్ ప్లాన్తో పాటు పదో తరగతి విద్యార్థుల నైట్ విజిట్ కార్యక్రమం ముగింపు
రోలుగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థుల విద్యా పురోగతిని మెరుగుపరచడం లక్ష్యంగా చేపట్టిన వందరోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా నిర్వహించిన“నైట్ విజిట్” కార్యక్రమం నేటితో విజయవంతంగా ముగిసింది.
ఈ కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయ బృందం ప్రతి విద్యార్థి ఇంటిని రాత్రి సమయంలో సందర్శించి వారి చదువుతున్న విధానం, సమయపాలన, చదువులపై ఆసక్తి, పరీక్షల పట్ల ఉన్న సిద్ధత వంటి అంశాలను ప్రత్యక్షంగా గమనించింది. ముఖ్యంగా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యంగా వారికి అవసరమైన సూచనలు, సలహాలు అందించారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శ్రీ టీ.వీ. శేషగిరిరావు గారు, ఆంగ్ల ఉపాధ్యాయిని శ్రీమతి పి.వి.ఎం. నాగాజ్యోతి గారు మరియు ఇతర ఉపాధ్యాయులు సమన్వయంతో పాల్గొని తల్లిదండ్రులతో కూడా మాట్లాడి పరీక్షల ప్రాముఖ్యతను వివరించారు.
వందరోజుల యాక్షన్ ప్లాన్తో పాటు నిర్వహించిన ఈ నైట్ విజిట్ కార్యక్రమం ద్వారా ప్రతి విద్యార్థి యొక్క విద్యా పరిస్థితిని సమగ్రంగా తెలుసుకోవడం సాధ్యమైందని, పరీక్షలకు మరింత మెరుగైన సిద్ధత సాధించడంలో ఇది ఎంతో ఉపయోగకరంగా నిలిచిందని పాఠశాల వర్గాలు పేర్కొన్నాయి.