పడుగుపాడులో ప్రజలకు తోఫాల పంపిణీ – కార్యక్రమంలో షేక్ అహ్మద్ పాల్గొనం
నెల్లూరు జిల్లా, కోవూరు మండలం పడుగుపాడు గ్రామంలో ఉన్న అహ్మదీయ మసీదు సెంటర్ వద్ద ఆదివారం ప్రజలకు తోఫాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర మైనార్టీ సంయుక్త కార్యదర్శి షేక్ అహ్మద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ఐక్యత, పరస్పర సహకారం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో Sd దావూద్, ఖలీమ్, సలీం భాయ్, అజీజ్, మౌలాలి, అనీఫ్ బాయ్, సయ్యద్ బక్షు బాయ్ తదితరులు పాల్గొని ప్రజలకు తోఫాలు పంపిణీ చేశారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.