logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ధైర్యంగా పరీక్షలు రాయండి… విజయం మీదే – టెన్త్ విద్యార్థులకు కాటం రెడ్డి దినేశ్ రెడ్డి

పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులందరికీ కాటం రెడ్డి దినేశ్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల జీవితంలో ఎంతో ముఖ్యమైన దశ అయిన టెన్త్ పరీక్షలను ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలని ఆయన సూచించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇంతకాలం మీరు కష్టపడి చదివిన ప్రతి పాఠంపై నమ్మకం ఉంచుకొని, ఎలాంటి భయం లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని విద్యార్థులకు సూచించారు. కష్టపడిన వారికి విజయం తప్పకుండా దక్కుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు మానసిక ధైర్యం ఇచ్చి, వారికి ప్రోత్సాహం అందించాలని ఆయన కోరారు. పరీక్షలు ఒక భవిష్యత్తు ప్రారంభం మాత్రమే కాని, భయపడాల్సిన విషయం కాదని అన్నారు.
పదవ తరగతి పరీక్షలు రాస్తున్న ప్రతి విద్యార్థి మంచి మార్కులతో ఉత్తీర్ణులై, తమ లక్ష్యాలను సాధించాలని కాటం రెడ్డి దినేశ్ రెడ్డి ఆకాంక్షించారు.
“ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి… విజయం తప్పకుండా మీ సొంతం అవుతుంది” అని విద్యార్థులకు సందేశం ఇచ్చారు.

1
1233 views

Comment