మహిళలకు ఉపాధి శిక్షణ
ఎచ్చెర్ల: స్థానిక నందమూరి తారకరామారావు నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారిత కేంద్రం(మహిళా ప్రాంగణం)లో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ(గుంటూరు) సౌజన్యంతో మహిళలకు ఉపాధి శిక్షణ ఇస్తున్నట్లు మేనేజర్ రబీకా సామ్యూల్ ఒక ప్రకటనలో తెలిపారు. రెండు నెలల శిక్షణ గల అసిస్టెంట్ బ్యూటీ థెరఫిస్ట్, 45 రోజుల శిక్షణ గల హ్యండ్ ఎంబ్రాయిడర్ 8 వ తరగతి విద్యార్హత, మూడు నెలల శిక్షణ గల డొమెస్టిక్ డేటాఎంట్రీ ఆపరేటర్కు పదో తరగతి చదివిన వారు అర్హులని పేర్కొన్నారు. 18 నుంచి 45 ఏళ్ల లోపు మహిళలు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు.