ఏటూరునాగారం: కర్రె గుట్టలపై ములుగు ఎస్పీ ఏరియల్ సర్వే
జర్నలిస్ట్: ఆకుల గణేష్
తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులోని మావోయిస్టుల ప్రభావిత కర్రె గుట్టలను కేంద్ర భద్రతా బలగాలు, రాష్ట్రాల పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ల ద్వారా స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో, ములుగు ఎస్పీ సుధీర్ కేకన్, ఏఎస్పీ మనన్ భట్, డీఎఫ్వో జాదవ్తో కలిసి భారత వాయుసేన హెలికాప్టర్లో కర్రె గుట్టలపై ఏరియల్ సర్వే నిర్వహించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, ఈ సర్వే ద్వారా ఆ ప్రాంతంలో భద్రతను పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.