జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు హాల్ టికెట్ల పంపిణీ
ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఎస్సెస్సీ పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లను ఘనంగా పంపిణీ చేశారు. హాల్ టికెట్తో పాటు పరీక్ష సమయంలో ఉపయోగపడే స్టేషనరీ కిట్ను కూడా విద్యార్థులందరికీ అందజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు టి.వి. శేషగిరిరావు గారు మాట్లాడుతూ, విద్యార్థులు పరీక్షలను భయపడకుండా ఆత్మవిశ్వాసంతో రాయాలని సూచించారు. టెన్షన్కు లోనుకాకుండా సమయపాలనతో చదివిన విషయాలను సరిగా గుర్తుచేసుకొని సమర్థంగా పరీక్షలను పూర్తి చేయాలని అన్నారు.
ఇతర ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు విలువైన సూచనలు అందిస్తూ, చివరి దశలో పునశ్చరణపై దృష్టి పెట్టాలని, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రశాంతంగా పరీక్షలకు హాజరుకావాలని సూచించారు.