*ట్రావెల్స్ బస్సు బోల్తా.. నలుగురి మృతి*
*ట్రావెల్స్ బస్సు బోల్తా.. నలుగురి మృతి*
Mar 13, 2026,
తెలంగాణ : నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం సమీపంలో జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. బస్సు 22 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి అకోలా వెళ్తుండగా, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బోల్తా పడినట్టు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలికి చేరిన పోలీసులు గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు.