ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ హెచ్జే దొర మృతి పట్ల ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా, డీజీపీగా పనిచేయడంతో పాటు, సీఐఎస్ఎఫ్ డీజీగా, కేంద్ర విజిలెన్స్ కమిషనర్గా అనేక హోదాల్లో సేవలు అందించారని గుర్తుచేసుకున్నారు.
పోలీసు శాఖలో పలు సంస్కరణలు తీసుకురావడంతో పాటు ఆ శాఖను ప్రజలకు చేరువ చేయడంలో వారెంతో కృషి చేశారని పేర్కొన్నారు. హెచ్జే దొర గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి గారు ప్రగాఢ సానుభూతిని, తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు.