నేటి నుంచి వెహికల్ రిజిస్ట్రేషన్లకు కొత్త విధానం*
జర్నలిస్టు : మాకోటి మహేష్
వాహనాల పర్మనెంట్ రిజిస్ట్రేషన్ విషయంలో నేటి (శుక్రవారం) నుంచి కొత్త విధానం అమలులోకి రానుంది
ఇకపై రిజిస్ట్రేషన్ పూర్తిగా ఆన్లైన్లోనే జరగనుంది
ఇవాళ్టి నుంచి ఫిజికల్ పేపర్లు తీసుకోబోమని రవాణాశాఖ స్పష్టం చేసింది
తాత్కాలిక రిజిస్ట్రేషన్ అయిన 7 రోజుల్లోగా డీలర్లు వెహికల్ ఓనర్, ఫైనాన్షియర్ సంతకాలతో ఫామ్20, ఇతర పత్రాలు ఆన్లైన్లో సమర్పించాలని పేర్కొంది
రెండు పని దినాల్లో వాటిని ఆమోదించాలని అధికారులను ఆదేశించింది
నకిలీ పత్రాలు సమర్పిస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని రవాణాశాఖ హెచ్చరించింది