బాక్సైట్ తవ్వే ప్రయత్నాలు ఆపాలంటూ కేంద్ర మంత్రికి అరకు ఎంపీ వినతి
100% షెడ్యూల్ ఏరియా ఉద్యోగాలు గిరిజనులకే దక్కేలా చర్యలు తీసుకోవాలని అరకు ఎంపీ డా తనూజరాణి కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జుయల్ ఓరం కు వినతి ఇచ్చారు. బుధవారం ఆమె పలు గిరిజన సంఘాలతో కలిసి న్యూఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి జీఓ నెం.3 రద్దుతో షెడ్యూల్ ఏరియా గిరిజన యువతకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు. అల్లూరి జిల్లాను జోన్ 1లో ఉంచాలని, పాడేరు ఏజన్సీలో బాక్సైట్ తవ్వే ప్రయత్నాలు ఆపాలని కోరారు.