ఆర్డిటి ఎఫ్ సి ఆర్ ఏ ను రెన్యూవల్ చేయాలని మడకశిర.......
ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆర్డిటి ఎఫ్ సి ఆర్ ఏ ను రెన్యూవల్ చేయాలని మడకశిర పట్టణ కేంద్రంలో ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి దళిత నాయకులందరూ కలిసి పూలమాలవేసి నివాళు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ H . అక్కులప్ప మాట్లాడుతూ ఆర్డిటి పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరించడం ఏమాత్రం మంచిది కాదని బీద ప్రజలకు ఇబ్బంది పెట్టాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది . కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎఫ్ సి ఆర్ ఏ ను రెన్యువల్ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాబోయే ఎన్నికలలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సరైన బుద్ధి చెప్పే అవకాశం ఉంటుందని తెలియజేశారు. ఆర్డిడి పై జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని నినాదాలను గమనించి ఈ కార్యక్రమంలో మడకశిర శాసనసభ్యులు ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు పాల్గొని మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆర్డిటి సమస్త పేద ప్రజలకు వ్యవసాయపరంగా విద్య పరంగా ఎస్సీ. ఎస్టీ. బీసీ .లకు సంబంధించిన వారికి సహాయ సహకారాలు అందజేయడం జరిగింది ప్రజలకు న్యాయం చేయాలనే ఒక ఆలోచనతో ఫెర్రర్ ఆర్డిటి సమస్తను ఏర్పాటు చేశారు ఈ సమస్త కు సంబంధించిన ఎఫ్సీఆర్ ను రెన్యువల్ చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు తో మరియు నారా లోకేష్తో మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో స్వయంగా మాట్లాడాను అది కొద్ది దినములలో ఆర్డిటి ఎఫ్ ఆర్ సి ఎ ను రెన్యువల్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వము ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగ అనంతపురం ఉమ్మడి జిల్లాల ఉపాధ్యక్షులు టైగర్ వన్నూరుస్వామి. సత్య సాయి జిల్లా అధ్యక్షులు గంగాద్రి. ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు గోలాపురం గంగాధరన్న ఎమ్మార్పీఎస్ సీనియర్ లీడర్ రామచంద్ర . మడకశిర తాలూకా అధ్యక్షులు రామాంజనేయులు మడకశిర మండల అధ్యక్షులు టి చందు. ధర్మవరం తాలూకా అధ్యక్షులు ఆదినారాయణ. హనుమంతు. ఎల్లోటి మాజీ సర్పంచ్ గోవిందప్ప. ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ నెంబర్ సత్యసాయి జిల్లా రామాంజనేయులు. సెట్టూరు మండల MPP జై , సోమనాథరెడ్డి రేకులకుంట హనుమంతరాయప్ప మడకశిర రవి ఆర్ డి టి లబ్ధిదారులు పాల్గొన్నారు